ఆంధ్రప్రదేశ్‌

తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే పతనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 25: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుమల వెంకన్నతో పెట్టుకుంటున్నారని, వారికి అథోగతి తప్పదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ పేర్కొన్నారు.
గురువారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తన వ్యాఖ్యలు, చేష్టలతో ప్రజలను ఇబ్బందులు గురిచేసి రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆయన గోబెల్స్‌ను మించిపోయారన్నారు. విజయ సాయిరెడ్డి మానసిక పరిస్థితి దిగజారి చివరకు దేవుళ్లు, ఆలయాలపై అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి చేరారన్నారు. గతంలో తిరుమల వెంకన్న వజ్రాలు, మఠం భూములు, హైదరాబాద్‌లోని స్వామివారి భూములను తన అల్లుడైన బ్రదర్ అనిల్‌కుమార్‌కు వైఎస్ రాజశేఖరరెడ్డి దోచిపెట్టారన్నారు. వైఎస్ వారసులమని చెప్పుకుంటున్న వారు దేవుడి పేరుతో రాజకీయం చేసేందుకు ఏ మాత్రం భయపడటం లేదని, చివరకు స్వామివారి బంగారంపైనే ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బంగారాన్ని బ్యాంకు నుండి తీసుకువస్తుంటే దానికి చంద్రబాబుకు సంబంధమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై బురదజల్లి అపఖ్యాతి పాలు చేయాలని ప్రయత్నిస్తున్న వారికి దైవమే బుద్ధి చెబుతుందని యామినీ శర్మ అన్నారు.