ఆంధ్రప్రదేశ్‌

‘వైసీపీకి లబ్ధిచేకూర్చడమే బీజేపీ వైఖరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 16: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరి చలమలశెట్టి రామానుజయ ఆరోపించారు. గురువారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మహేష్‌రెడ్డి పోటీనుంచి విరమించుకునే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రోత్సహించారన్నారు. తాము మొదటి నుంచి బీజేపీ, వైసీపీ రెండూ ఒకటేనని చెప్తూనే ఉన్నామన్నారు. రాజంపేట నియోజకవర్గంలో కాపులు అధికంగా ఉన్నారని, ఆ నియోజకవర్గంలో మిథున్‌రెడ్డికి సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. టీడీపీ కాపు సామాజికవర్గానికి చెందిన డీకే సత్యప్రభకు టిక్కెట్ ఇవ్వగా ఆమెను నష్టపరిచే విధంగా బీజేపీ నేతలు ప్రయత్నించారన్నారు. కన్నా తన స్వార్థ ప్రయోజనాల కోసం కాపులను మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్‌లో ఈశ్వరచంద్ర విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి అల్లర్లు సృష్టించారన్నారు. ఒకరోజు ముందుగానే అక్కడ ప్రచారాన్ని నిలిపివేయటం ద్వారా ఈసీని మోది ఏవిధంగా ఉపయోగించుకున్నారో అర్థమవుతోందన్నారు.