ఆంధ్రప్రదేశ్‌

జగన్‌ను ఆశీర్వదించిన రమణ దీక్షితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మే 16: కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గురువారం కలిశారు. పురోహితులను వెంటబెట్టుకుని గురువారం ఉదయం పులివెందుల వచ్చిన రమణ దీక్షితులు నేరుగా జగన్‌మోహన్‌రెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. అక్కడ జగన్‌కు స్వామివారి పట్టువస్త్రాలు, ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. దేవుని ఆశీస్సులు మీకు ఉన్నాయని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మీరేనని రమణ దీక్షితులు జగన్‌తో అన్నట్లు సమాచారం.

చిత్రం... జగన్‌ను ఆశీర్వదిస్తున్న రమణ దీక్షితులు