ఆంధ్రప్రదేశ్‌

జగన్‌కు డిక్లరేషన్ ఫారం అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మే 25: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి డిక్లరేషన్ ఫారాన్ని వైకాపా నేతలు అందజేశారు. శనివారం తాడేపల్లిగూడెంలోని నివాసంలో పార్లమెంట్ సభ్యుడు వైఎస్.అవినాష్‌రెడ్డితో కలిసి జగన్ కలిసిన దివంగత నేత వైఎస్ వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి డిక్లరేషన్ ఫారాన్ని అందించారు. ఈనెల 23న జరిగిన ఓట్ల లెక్కింపులో జగన్ పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. జగన్ తరపున నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి డిక్లరేషన్ ఫారం తీసుకున్నారు. కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ జగన్‌కు సంబంధించిన డిక్లరేషన్ ఫారాన్ని ఆయన తరఫున శివప్రకాష్‌రెడ్డికి అందజేశారు.