ఆంధ్రప్రదేశ్‌

తెప్పపై భక్తులను కటాక్షించిన పద్మావతి అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 15: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో ఐదవరోజైన సోమవారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తలను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.30నుండి 5గంటల వరకు నీరాడమండపంలో శ్రీపద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 నుండి 7.45గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. పుష్కరిణిలో అమ్మవారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీపద్మావతి అమ్మవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి స్థానిక ఆలయాల డిప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, ఏఈఓ సుబ్రమణ్యం, ఏవీఎస్‌ఓ నందీశ్వర్‌రావు, సూపరింటెండెంట్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
చిత్రం...తిరుచానూరు పద్మ పుష్కరిణిలో తెప్పపై విహరిస్తున్న పద్మావతీ అమ్మవారు