ఆంధ్రప్రదేశ్‌

మరో మూడు నెలల్లో టీడీపీ దుకాణం బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 21: మరో మూడునెలల్లో తెలుగుదేశం పార్టీ దుకాణం మూసుకోవడం ఖాయమని, రాష్ట్ర ప్రజలు దీన్ని చూడబోతున్నారని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా అన్నారు. శుక్రవారం కడపలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అవినీతి, అక్రమాలు వెలుగుచూసి జైలుకు పంపుతారనే భయంతోనే చంద్రబాబు పార్టీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్పించారని ఆరోపించారు. చంద్రబాబునాయుడుకు వయసు మీదపడిందని , ఆయన కుమారుడు సమర్థుడు కాకపోవడంతో తెలుగుదేశం పార్టీ వారు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చంద్రబాబు అవినీతిని వెలికితీస్తాయన్న గ్రహించి కొత్త కుట్రలకు తెరలేపి కుయుక్తులు పన్నుతున్నారన్నారు. వయసు మీదపడిన చంద్రబాబునాయుడు రాజకీయాల నుండి వైదొలగడం ఉత్తమమని అంజద్‌బాషా సూచించారు.
ఇక తహశీల్దార్‌లను వెనక్కి పంపించండి