ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 22: రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా కింద ప్రభుత్వం రూ 12వేల 500 ఆర్థిక సాయాన్ని అందించాలనే కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో పొలాల్లో బోర్లు వేసుకునేందుకు అవసరమైన రిగ్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందన్నారు. శనివారం సచివాలయంలో తన చాంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ కార్యాలయ ప్రవేశం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.