ఆంధ్రప్రదేశ్‌

అభియోగాలున్న వారికి ఎలాంటి హామీలివ్వలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 22: అభియోగాలు ఉండి తమ పార్టీలో చేరుతున్న టీడీపీ ఎంపీలకు తాము ఎటువంటి హామీలు ఇవ్వలేదని, రాజ్యసభలో తమ సంఖ్యాబలం తక్కువగా ఉన్నందునే తెలుగుదేశం సభ్యులను చేర్చుకున్నట్లు భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. శనివారం గుంటూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తాను టీడీపీ రాజ్యసభ సభ్యులను విమర్శించింది నిజమేనని, వారు కూడా తమను విమర్శించారన్నారు. దేశాభివృద్ధిని కాంక్షించే తాము బీజేపీలో చేరినట్లు టీడీపీ సభ్యులు చెప్పారన్నారు. వారిపై వచ్చిన అభియోగాలపై వారే సమాధానం చెప్తారని, తమ పార్టీలో చేరిన వారికి మంచివారు అని తాము సర్ట్ఫికెట్లు ఇవ్వలేదన్నారు. బీజేపీలో చేరిన వారు పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడే పనిచేయాలన్నారు. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి చూసే బీజేపీకి ప్రజలు ఓట్లు వేసి 303 స్థానాల్లో బీజేపీకి పట్టం కట్టారన్నారు. 2024 నాటికి మరో 50 స్థానాల్లో విజయం సాధించే దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగా గత ఐదేళ్లలో 9 కోట్ల మందికి మరుగుదొడ్ల నిర్మాణం, 7 కోట్ల మంది మహిళలకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందజేశామన్నారు. మరో 3 కో ట్ల కుటుంబాలకు దేశవ్యాప్తంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. రానున్న ఐదేళ్లలో దేశంలోని 14 కోట్ల కుటుంబాలకు నీటి సరఫరా చేసి, 70 కోట్ల మంది ప్రజలకు మంచి చేయాలన్నదే మోదీ లక్ష్యమన్నారు. 2024 నాటికి రాష్ట్రంలో బలీయమైన శక్తిగా బీజేపీ ఎదుగుతుందని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు.
చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న నరసింహారావు