ఆంధ్రప్రదేశ్‌

ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను ఖండిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 22: షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యుడు కె రాములు పేర్కొన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన రాజమహేంద్రవరంలోని స్థానిక ర్ రెసిడెన్సీలో ప్రతినిధులు స్వాగతం పలికారు. షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన తమపై ఎన్నో విధాలుగా దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని, కొన్ని చోట్ల గ్రామ బహిష్కరణలు కూడా జరుగుతున్నాయని ఆయా కుల నాయకులు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీలపై అరాచకాలు, దాడులు, హత్యలు జరిగినట్టు కమిషన్ దృష్టికి వస్తే విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పూర్తిగా వినియోగించుకుంటూ సమాజంలో తలెత్తుకుని తిరిగేలా కమిషన్ అండగా వుంటుందన్నారు. కార్యక్రమంలో డిఎంఆర్ శేఖర్, ఎస్ దనయ్య, రామకృష్ణ, బర్రే కొండబాబు, ఆనందకుమార్, కోరుకొండ చిరంజీవి, తాళ్లూరి రాజేంద్ర ప్రసాద్, కప్పల వెలుగుకుమారి, నక్కా రాజబాబు తదితరులు పాల్గొన్నారు.