ఆంధ్రప్రదేశ్
మద్య నిషేధంలో మీడియా భాగస్వామ్యం కావాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 23 June 2019
తిరుపతి, జూన్ 22: పేద జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యపానం క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందని అందుకే మద్యాన్ని దశలవారీగా నిషేధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పంలో మీడియా కూడా భాగస్వామ్యం కావాలని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్శాఉ మంత్రి నారాయణ స్వామి అన్నారు. శనివారం టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వై.వి.సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడారు. పేదరికం పోవాలంటే పేదవారు దుర్వ్యసనాల నుంచి దూరం చేయడం ఒక మార్గమన్నారు. ఇందుకు ప్రధానంగా మద్యం అన్నారు. మద్యం అమ్మకాలతో ప్రభుత్వాలను నడిపే పరిస్థితి ఉండకూడదన్నారు.