ఆంధ్రప్రదేశ్‌

8న రైతు దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 5: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8న రైతు దినోత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుస్థిర వ్యవసాయాన్ని సాధించేందుకు వీలుగా రైతులకు కావాల్సిన సేవలు, ఇతర అంశాల్లో మద్దతు ఇచ్చేందుకు వీలుగా రైతు దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో, నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల అధికారులతో జిల్లా స్థాయి కమిటీ పర్యవేక్షణలో రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భూసార కార్డులు, ఇతర ఆస్తుల పంపిణీ, రైతులు, శాస్తవ్రేత్తలతో ముఖాముఖీ, ఉత్తమ రైతులుగా గుర్తించి 10 మంది రైతులకు సన్మానం వంటి కార్యక్రమాలు నిర్వహించాలి. నియోజకవర్గాల్లో నిర్వహణకు లక్ష రూపాయలు, రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి 80 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రాష్టస్థ్రాయి రైతు సదస్సును ఆ రోజు జమ్మలమడుగులో నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు.