ఆంధ్రప్రదేశ్‌

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా వరలక్ష్మీవ్రతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 12: తిరుమల శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం వరలక్ష్మీవ్రతం వైభవంగా జరిగింది. వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన , నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపంలో వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కుంకుమార్చన, వ్రత వైశిష్ట్యం మహానివేదన, మంగళ హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్థాన మండపాన్ని రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి దంపతులు, టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి. సాంబశివరావు దంపతులు, తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
chitram...
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్న అర్చక స్వాములు