ఆంధ్రప్రదేశ్‌

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదగంట్యాడ, జూలై 8: ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర నేత శశిధరన్ పిళ్లై పార్టీ నేతలకు సూచించారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం ముసలినాయుడుపాలెంలో సోమవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు సభ్య నమోదు కార్యక్రమాన్ని చేపట్టాన్నారు. సభ్యత్వాల స్వీకరణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేయాలన్నారు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో పార్టీ సభ్యత్వ నమోదు సంతృప్తికరంగా సాగుతోందన్నారు. దేశం గర్వించదగ్గ నేత నరేంద్ర మోదీ అని ఆయన ప్రశంసించారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించేలా కృషి చేస్తున్నారన్నారు. ఏపీలో బీజేపీ బలం పుంజుకుంటోందన్నారు. దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. అనంతరం పార్టీలో చేరేందుకు ముందుకొచ్చిన వారికి సభ్యత్వాలను అందజేశారు. స్థానిక నేతలు గోలి శంకరరావు, మోహన్‌రావు పట్నాయక్, గొందేశి ఎరుకునాయుడు, గొందేశి గురప్ప, ములకలపల్లి ఈశ్వరరావు, ఎం.తులసీదాస్, ములకలపల్లి రోహిణి, మద్ది తాతారావు, అప్పలరెడ్డి, కిల్లాని రమణ పాల్గొన్నారు.
చిత్రం...కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర నేత శశిధరన్ పిళ్లై