ఆంధ్రప్రదేశ్
‘స్వయం శక్తి’కి అండగా ప్రభుత్వం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 9 July 2019
నరసన్నపేట, జూలై 8: స్వయం శక్తితో జీవించే ప్రతీ రైతుకూ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా సోమవారం ఇక్కడ నిర్వహించిన రైతు దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన జగన్ నెలరోజుల్లోనే పరిపాలనను గాడిలో పెట్టారన్నారు. రైతులకు ఏడాదికి రూ.12,500లు చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు అందజేస్తామన్నారు. సాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని ప్రాజెక్ట్ల ద్వారా సకాలంలో వ్యవసాయానికి నీరు అందించేలా కృషి చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రతీ నిరుపేదకు గృహ వసతి కల్పించి తీరుతామన్నారు.
చిత్రం...శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ధర్మాన కృష్ణదాస్