ఆంధ్రప్రదేశ్‌

వరదరాజస్వామి, కామాక్షి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 16: తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీవరదరాజస్వామివారి ఆలయంలో 40 ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే అత్తివరదరాజస్వామి వారి వేడుకలను పురస్కరించుకుని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్‌కు జిల్లా కలెక్టర్ పొన్నయ్య, ఎస్పీ కన్నన్, ఆలయ ఈవో త్యాగరాజర్ ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత కాంచీపురంలోని శ్రీకామాక్షి అమ్మవారిని చైర్మన్ దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ మేనేజర్ శ్రీకార్యన్ టీటీడీ చైర్మన్‌కు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ లోకనాథం, చైర్మన్ పిఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... కంచిలోని అత్తివరదరాజస్వామిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు