ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీజీఎస్ సీఈవోగా బాబు అహ్మద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 16: రియల్ టైమ్ గవర్నెన్సు సొసైటీకి పూర్తి స్థాయి సీఈవోగా బాబు అహ్మద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆర్టీజీఎస్‌ను అదనపు బాధ్యతగా చేపట్టారు.
మరో సలహాదారు నియామకం
పారిశ్రామిక ప్రగతికి సంబంధించి సలహాదారుని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. తాజాగా కృష్ణ జివి గిరిని సలహదారుగా నియమించింది.
ఆజాద్‌కు మళ్లీ పోస్టింగ్
అదేవిధంగా దేవదాయ, ధర్మదాయ శాఖ రాజమహేంద్రవరం మల్టీ జోన్-1 రీజినల్ జాయింట్ కమిషనర్ ఎస్‌ఎస్ చంద్రశేఖర ఆజాద్‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయానికి మంచి ఆస్తులు ఉన్నాయన్న కేసులో డిసెంబర్ 2017లో కేసు నమోదు చేసిన అప్పటి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌కు గురైన కేసులను గత నెల 19న సమీక్షించిన కమిటీ, ఆజాద్ పునర్ నియామకానికి సిఫారసు చేసింది. ఈమేరకు ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.