ఆంధ్రప్రదేశ్‌

టీడీపీకి వైకాపాకు తేడా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 18: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తేడా ఏమీ లేదన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు, కోట, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటించి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. నెల్లూరులో పార్టీ కార్యాలయంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 2నెలలు కాకముందే టీడీపీ పాలనను తలపించే విధంగా వీరి పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తోందన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో అధికారం పట్టే విధంగా పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోందన్నారు. అనంతరం గూడూరు మండలం చెన్నూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నిధులు చెల్లిస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు తమవేనని ప్రచారం చేసుకోవడం బాధాకరమని కన్నా లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారని, ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల సభ్యత్వాలతో బీజేపీ ముందంజలో ఉందన్నారు. బీజేపీ సిద్ధాంతపరంగా పనిచేస్తుందని అన్నారు. నరేంద్ర మోదీ 2014లో ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో పేదరిక నిర్మూలన, అభివృద్ధి, దేశ రక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్నారన్నారు. బీజేపీ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాల పేర్లు పెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం మంచిది కాదన్నారు. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముందున్నదని అన్నారు. అయితే నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత అమిత్‌షాలాంటి వ్యక్తుల వల్ల నేడు ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా బీజేపీ తయారైందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ బీజేపీపై అవాకులు చవాకులు మానుకోవాలని ఆ పార్టీ నాయకులు బీజేపీపై బురదచల్లడం మంచిది కాదన్నారు. అనంతరం వెంకటగిరిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కుటుంబ పాలనకే పరిమితమైందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుంచి కుటుంబ పాలనకే పరిమితిమై రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఏపిలో ముఖ్యమంత్రి పదవి ఒక కులానికో, ఒక కుటుంబానికో పరిమితమైందని అన్నారు. భారతీయ జనతాపార్టీలో కుల, మత, కుటుంబాలకు అతీతంగా పాలన సాగిస్తుందన్నారు.

చిత్రం...నెల్లూరులో బీజేపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ