ఆంధ్రప్రదేశ్‌

మోదీ ఇంటిముందు ధర్నా చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ ఇంటి ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని, రాష్ట్రంలో కూర్చుని ఉపన్యాసాలు ఇస్తే హోదా రాదని వైకాపా ఎమ్మెల్యే కోటం శ్రీ్ధర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో బిజెపి, కాంగ్రెస్ మోసం చేశాయని, విభజన హామీలు ఇంతవరకు నెరవేరలేదని చంద్రబాబు మాట్లాడడం తగదన్నారు. గత రెండేళ్లుగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వంలో టిడిపి మంత్రులు ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు.
బిజెపి-టిడిపి పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోసం చేస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాలు సాధించలేకపోయినందుకు కేంద్ర మంత్రివ ర్గం నుంచి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని భూముల కుంభకోణం, ఓటుకు నోటు కేసుల్లోంచి బయట పడేందుకు చంద్రబాబు కేంద్రంతో సఖ్యతగా ఉన్నారన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉండగా, ఇంతవరకు ఎంత ఇచ్చిందో వివరాలు బహిర్గతం చేయాలన్నారు.
వైసీపీ క్రమశిక్షణా
కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటుచేస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎంపి విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, సాగి దుర్గాప్రసాదరాజు, మేరుగు నాగార్జున, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కొలుసు పార్ధసారథి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ నియమితులయ్యారు.