ఆంధ్రప్రదేశ్‌

బాణసంచా పేలి ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరాపల్లి, ఆగస్టు 17: విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం ఏ.కొత్తపల్లిలో అనధికారిక బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం సంభవించిన పేలుడులో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన కాటపల్లి బుజ్జి (16), గాలి రాంబాబు (35) అక్కడికక్కడే మంటల్లో చిక్కుకుని దుర్మరణం చెందగా విశాఖ కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ జుంజూరి శివ (30) మృతి చెందాడు. ఘటనలో విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన శంకరరావు (25), కెఎం పాలెం గ్రామానికి చెందిన కంభంపాటి మహేష్ (28), ఏ.కొత్తపల్లికి చెందిన కొల్లూరి నాగేశ్వరరావు(35), బాణా సంచా తయారు చేయిస్తున్న యజమాని కొల్లూరి సూర్యారావు (40) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కెజిహెచ్‌కి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని కెజిహెచ్ వైద్యులు నిర్థారించారు. ఘటనా స్ధలాన్ని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, అనకాపల్లి ఆర్డీఓ ఆర్.పద్మావతి, ఎంపిపి కిలపర్తి భాస్కరరావు, జెడ్పీటీసి సభ్యులు గాలి వరలక్ష్మి, తహశీల్దార్ వైఎస్ నాగరాజు, చోడవరం సిఐ మురళీధర్ తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించారు.