ఆంధ్రప్రదేశ్‌

వాహనం ఢీకొని జింక మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఆగస్టు 17: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఓ వాహనం ఢీకొని జింక మృతి చెందిన సంఘటన మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులోని 7వ కిమీ వద్ద మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతున్న జింకను తమిళనాడు భక్తులకు చెందిన ఓ టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక తీవ్రంగా గాయపడి కదలలేని పరిస్థితిలో అక్కడే కుప్పకూలి పోయింది. అటుగా వెళుతున్న ఇతర వాహన చోదకులు జింక గాయపడిన సంఘటన గురించి ఘాట్‌రోడ్డు సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా జింక అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం జింక కళేబరానికి శవ పంచనామా నిర్వహించి సమీపాన అడవిలో ఖననం చేశారు.