ఆంధ్రప్రదేశ్
పుష్కరఘాట్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 19 August 2016
రాజమహేంద్రవరం, ఆగస్టు 18: గోదావరి స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. రాజమహేంద్రవరంలో పుష్కరఘాట్లో గురువారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రాత్రి 9 గంటల వరకూ వారి కోసం గాలిస్తూనేవున్నారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన చైతన్య (19) స్థానికంగా ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్నాడు. దివాన్చెరువు ప్రాంతంలో ఉంటున్న చైతన్య అదే ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకట నగేష్ (16) మరో ముగ్గురితో కలిసి పుష్కరఘాట్కు చేరుకున్నారు. నలుగురు గోదావరిలో స్నానానికి దిగారు. అయితే చైతన్య, నగేష్ ఇద్దరూ నీటిలో మునిగిపోయారు.