ఆంధ్రప్రదేశ్‌

రాజధాని అమరావతిని మారిస్తే రాష్ట్రం అగ్నిగుండమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 21: రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి మరో ప్రాంతానికి తరలించాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. రాజధానిని మారిస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ కృష్ణా వరదలను అడ్డం పెట్టుకుని రాజధాని మార్చాలనే కుట్రకు పథకం రచించారని, దానికి మంత్రి బొత్స వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి జగన్ అమెరికాలో ఉండి ఇక్కడ బొత్స లాంటి కీలుబొమ్మలను ఆడిస్తున్నారని, జగన్ అమెరికాలో స్విచ్ నొక్కితే ఆంధ్రాలో బొత్స దగ్గర బల్బు వెలిగిందని ధ్వజమెత్తారు. అసలు జగన్‌మోహన్‌రెడ్డికి అమరావతి మీద ఎందుకింత ద్వేషమన్నారు. ఎన్నికల ముందుగాని, తన మ్యానిఫెస్టోలోగాని రాజధాని అమరావతి మార్పుపై ఎందుకు చెప్పలేదన్నారు. గత ప్రభుత్వం ఒప్పందం ప్రకారం రాజధాని రైతులకు ఇవ్వవలసిన కౌలును ఇవ్వనప్పుడే, బడ్జెట్‌లో నిధులు కేటాయించనప్పుడే, కేంద్ర ప్రభుత్వాన్ని రాజధాని అమరావతికి అభివృద్ధి నిధులు అడగనప్పుడే రాజధాని అమరావతిని మారుస్తారన్న అనుమానం వచ్చిందని రామయ్య అన్నారు. అమరావతిని రాజధానిగా ఎత్తేయడం కోసం కృత్రిమ వరదను సృష్టించి, అది వంకగా చూపి రాజధానికి ఇది సరైన ప్రాంతం కాదని చెప్పటం కోసం జగన్ ప్రభుత్వం కష్టపడుతోందని ఎద్దేవా చేశారు.