ఆంధ్రప్రదేశ్‌

గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతల స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అమరావతి సచివాలయంలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశానికి గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ రంజిత్ బాషా, ట్రైకార్ ఎండీ ఈ రవీంద్రబాబు, జీసీసీ ఎండీ బాబూరావు నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ శేషుకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ పరిధిలో నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టో అమలు, బడ్జెట్ కేటాయింపులపై ప్రధానంగా చర్చించారు. అలాగే గ్రామ వలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాలపై చర్చించారు. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతి ప్రభుత్వ పథకం గిరిజనులకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలల పరిస్థితి, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.