ఆంధ్రప్రదేశ్‌

ప్యాంట్లు తడుపుకున్నది ఎవరో ప్రజలకు తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఆగస్టు 21: మోదీ, అమిత్ షాలను చూసి ప్యాంటు తడుపుకున్నది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. గతంలో మోదీ తిరుపతి పర్యటనకు వచ్చిన సందర్భంగా మీ సీఎం ప్రవర్తించిన తీరును ప్రజలంతా ప్రత్యక్షంగా చూసారని బుధవారం ట్విట్టర్‌లో వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మెడలు వంచుతామని ప్రగల్బాలు పలికి ఇప్పుడు నడుం వంచి కాళ్లు పట్టుకున్న మీరు కూడా ధైర్యం గురించి మాట్లాడితే ఆ ధైర్యానికి కూడా దరిద్రం పట్టుకుంటుందన్నారు. దరిద్రానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నా మన రాష్ట్రంలో మాత్రం వర్షం జాడే లేదన్నారు. తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో వరదలను రాజకీయం చేస్తున్నారని, చెత్త రాజకీయాలతో రాయలసీమ రైతులకు చుక్కనీరు లేకుండా చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. మీ చెత్త ఐడియాలతో అమెరికా టూర్ మొత్తం తుస్సు మనలేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ అమెరికా నుండి వచ్చే లోపు ముందు నువ్వు వెళ్లి రైతుల బుగ్గలు నిమిరే పని మొదలు పెట్టాలని విజయసాయిరెడ్డికి సూచించారు.