ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ విమర్శిస్తే టీడీపీపై ఏడుపా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఆగస్టు 21: అత్త కొట్టినందుకు కాదు గానీ, ఆడపడుచు నవ్వినందుకు ఏడ్చినట్లుగా ఉంది వైకాపా నేతల ప్రవర్తన అంటూ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. అమెరికాలో మీ అధినేత చేసిన ఘనకార్యానికి బీజీపీ వాళ్ళేదో అంటే తెలుగుదేశం పార్టీపై పడి ఏడుస్తారెందుకు అంటూ వైసీసీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని బుధవారం ట్విట్టర్ వేదికగా జవహర్ సూటిగా ప్రశ్నించారు. మీరు చేస్తున్న విమర్శలు చూస్తుంటే పాత కాలం నాటి సామెత గుర్తుకు వస్తోందన్నారు. బీజేపీ వాళ్లను తిరిగి అనే ధైర్యం లేక టీడీపీని విమర్శించే పని పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. కేసులు తిరగతోడతారనే భయం ఎవరికి ఉందో, అందుకోసం కాళ్ళు పట్టుకుందెవరో అందరికీ బాగా తెలుసని జవహర్ పేర్కొన్నారు. మీ అధినేత ఉన్నన్నాళ్లూ ఒక్క నీటి చుక్క లేక రాష్ట్రం అల్లాడితే ఆయన జెరూసలేం వెళ్తాడనగానే గోదావరికి, అమెరికా వెళ్తాడనగానే కృష్ణకు వరదలొచ్చాయని గుర్తు చేశారు. ఈ పరిస్థితిని ఏమంటారో విజయసాయిరెడ్డిగారే చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత వరదొచ్చినా ఇంకా తాగడానికి కనీసం నీళ్లు లేక ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా మీకు పట్టడం లేదన్నారు. వరద రాజకీయాలు చేస్తూ టీడీపీని విమర్శించటమే పనిగా పెట్టుకున్నారన్నారు. మీ పాలనలో ఇటువంటి మహిమలు ఇంకా ఎన్ని చూడాలో అంటూ జవహర్ ఎద్దేవా చేశారు.