ఆంధ్రప్రదేశ్‌

అవకతవకలపై కమిటీ వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: మెడికల్ అడ్మిషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన అన్యాయం, అవకతవకలపై తక్షణమే అఖిలపక్షం వేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. 2019-20 మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి రిజర్వేషన్ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖామంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. అన్యాయం జరిగిన రిజర్వేషన్ వర్గాలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మెడికల్ అడ్మిషన్లలో అవకతవకలపై అన్ని రాజకీయ పక్షాలతో కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేసారు.