ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్, సీఎం కృష్ణాష్టమి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు ఇచ్చిన శాశ్వతమైన సందేశాన్ని భగవద్గీత గుర్తు చేస్తుందని, ఆ రోజున పురస్కరించుకుని శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారన్నారు. ఈ శుభ సందర్భంగా శాంతి, పురోగతి, శ్రేయస్సుతో ప్రజలు వర్థిల్లాలని ఆకాంక్షించారు. సీఎం జగన్ మాట్లాడుతూ చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తుగా దేశ వ్యాప్తంగా ప్రజలంతా జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. విష్ణు భగవానుని అవతారమైన శ్రీ కృష్ణ పరమాత్ముని జన్మాష్టమి సందర్భంగా ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలంతా సుఖశాంతిలతో సంతోషంగా బతకాలంటూ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. చేసే పనిలో ఎలా సంతోషం వెతుక్కోవాలో జనులకు చాటేందుకే కృష్ణావతారమని అన్నారు.