ఆంధ్రప్రదేశ్‌

బాబును మెంటల్ హాస్పిటల్‌లో చేర్చాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఆగస్టు 24: తిరుమల ఆర్టీసీ టికెట్లను గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయిరెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు ఏమీ తెలియనట్లు నంగనాచి కబుర్లతో ప్రకటనలు చేస్తున్నారని శనివారం ట్విట్టర్‌లో విమర్శించారు. తిరుమల ఆర్టీసీ టికెట్ల ద్వారా అన్యమత ప్రచారం జరుగుతోందని వచ్చిన ఆరోపణలపై శనివారం ఆయన స్పందించారు. ప్రస్తుతం మాజీ సీఎం చంద్రబాబు మెంటల్ కండిషన్ సరిగా లేదని, వెంటనే ఆసుపత్రిలో చేర్పించాల్సిందేనని ఆయన ధ్వజమెత్తారు. చంద్రన్న పథకాల్లో భాగంగా తిరుమల ఆర్టీసీ టికెట్లను నాటి టీడీపీ ప్రభుత్వమే ముద్రించిందని, ఇప్పుడు అన్యమత ప్రచారం అంటూ విద్వేషాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. కేవలం మూడు నెలలకే చంద్రబాబు ఇంతలా బట్టలు చించుకుంటే మిగిలిన ఐదేళ్లు ఎలా తట్టుకుంటారని ప్రశ్నించారు. ఏదేమైనా చంద్రబాబు మెంటల్ కండిషన్‌పై కుటుంబ సభ్యులు, పచ్చచొక్కా నేతలు కాస్త పట్టించుకోవాలంటూ ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.