ఆంధ్రప్రదేశ్‌

విజయసాయిరెడ్డి ప్రకటనలు బూటకమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 24: తాము చేస్తున్న పనులకు ప్రధాని మోదీ, అమిత్‌షా ఆశీస్సులున్నట్టు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనలు ఒట్టి బూటకమేనని తేలిందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. పీఎంవో, కేంద్ర మంత్రి షెకావత్ వ్యాఖ్యలతో ఈవిషయం నిరూపితమైందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి పీఎంవో అధికారులను కలిసినప్పుడు ‘అన్నీ మమ్మల్ని సంప్రదించి చేస్తున్నారా. పోలవరం రీటెండర్లు, విద్యుత్ ప్రాజెక్టులపై పునస్సమీక్ష వద్దని చెప్పాం కదా, మరి ఎందుకు చేపట్టారు? వాటిని మా ఆశీస్సులతో చేస్తున్నారా?’ అంటూ నిలదీసిన విషయం వాస్తవం కాదా ఆయన ప్రశ్నించారు. కేవలం ఆయా అధికారులు, మంత్రులతో మాట్లాడినంత మాత్రాన వారి అంగీకారం ఉందని ఎలా చెబుతారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మండిపడటం నిజంకాదా? అని ప్రశ్నించారు. అన్నీ కేంద్రం ఆశీస్సులతోనే చేస్తున్నామంటూ విజయసాయిరెడ్డి వంటి నాయకులు చెప్పటం ప్రజలను పక్కదారి పట్టించడమేనని, నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.