ఆంధ్రప్రదేశ్‌

వెంకయ్య నెల్లూరు పర్యటన రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు 24: భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లా పర్యటన రద్దయింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూయడంతో వెంకయ్యనాయుడు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. శనివారం ఉదయం నెల్లూరు జిల్లా పర్యటన కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి చెన్నై బయలుదేరి వచ్చిన వెంకయ్యనాయుడు అటు నుండి అటే తిరిగి ఢిల్లీకి వెనుదిరిగారు. మామూలుగా అయితే శనివారం మధ్యాహ్నం ఆయన నెల్లూరుకు చేరుకోవాల్సి ఉంది. సాయంత్రం చెర్లోపల్లిలో రైల్వే టనె్నల్ పనులను పరిశీలించాలి. ఆదివారం గూడూరు-విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించాల్సి ఉంది. అలాగే విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొనాలి. సోమవారం బొడ్డువారిపాలెంలో భారత రక్షణ శాఖకు సంబంధించిన అల్యూమినియం పరిశ్రమకు శంకుస్థాపన చేయాలి. జైట్లీ మృతితో ఆయన మూడు రోజుల జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ శేషగిరిబాబు అధికారికంగా ధ్రువీకరించారు. కాగా నెల్లూరు పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ హరిచందన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు చేరుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి వార్తతో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఆయన పర్యటన రద్దు చేసుకుని వెనుతిరిగి వెళ్లారు.