ఆంధ్రప్రదేశ్‌

ప్రమాదంపై సీఎం సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పడవ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను వినియోగించాలని సూచించారు. నేవీ, ఓఎన్జీసీ హెలికాప్టర్లను రంగంలో దించాలన్నారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించాలని అందుబాటులో ఉన్న మంత్రులను ఆదేశించారు. ఘటనపై ఎప్పటికప్పుడు తమకు నివేదిక అందజేయాలన్నారు. తక్షణమే బోటు సర్వీసులన్నీ సస్పెండ్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. లైసెన్స్‌లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తు జాగ్రత్తలను పరిశీలించాలని, నిపుణులతో పటిష్టమైన మార్గదర్శకాలు తయారుచేసి తనకు నివేదించాలని ఆదేశించారు. ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని మంత్రులు, అధికారులకు స్పష్టం చేశారు.