ఆంధ్రప్రదేశ్‌

10 నుంచి ఐదు రోజులపాటు వైఎస్సార్ కంటి వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో అక్టోబర్ 10వ తేదీ నుంచి ఐదు రోజులపాటు డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని, ఇందుకుగాను తొలుత తక్షణం రూ. 530 కోట్లు కేటాయించామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మంగళవారం జరిగిన డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు రాష్ట్ర స్థాయి వర్క్‌షాపులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 62 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 70 లక్షల మంది పిల్లలకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ పథకం అమలు చేయాలని బృహత్తర ప్రణాళికను రూపొందిస్తున్నట్లు నాని చెప్పారు. మానవ శరీరంలో కళ్లు చాలా ప్రధానం. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.