ఆంధ్రప్రదేశ్‌

మరో ఆరు మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరుమందం వద్ద ఆదివారం గోదావరిలో మునిగిపోయిన బోటు ప్రమాదానికి సంబంధించి బుధవారం మరో ఆరు మృతదేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన కచ్చులూరు వద్ద ఐదు మృతదేహాలు, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి, బంధువులకు అప్పగించారు. బుధవారం నాటి ఆరుతో కలిపి ఇప్పటివరకు 34 మృతదేహాలు లభించినట్టయ్యింది. బోటులోని మొత్తం 73 మందికి గాను 26మంది బయటపడగా, ఎనిమిది మృతదేహాలు తొలి రోజునే లభించాయి. 39మంది గల్లంతైనట్టు గుర్తించి, గాలింపు చేపట్టారు. రెండో రోజు సోమవారం ఫలితం లేకపోగా, మూడో రోజు మంగళవారం వివిధ ప్రాంతాల్లో 20 మృతదేహాలు లభించాయి. బుధవారం నాటి ఆరుతో కలిపి సంఖ్య 34కు చేరింది. ఇంకా 13మంది ఆచూకీ తెలియాల్సివుంది.
కాగా బోటు ప్రమాదం సంభవించి నాలుగు రోజులు కావడంతో మృతదేహాలన్నీ ఉబ్బిపోయి బాగా పాడైన స్థితిలో నీటిపై తేలుతున్నాయి. తేలుతున్న మృతదేహాలను తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చి, రాజమహేంద్రవరం ఆస్పత్రికి తెస్తున్నారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను అంబులెన్స్‌లో అధికారులను తోడిచ్చి, స్వస్థలానికి పంపిస్తన్నారు. బుధవారం లభించిన ఆరు మృతదేహాలు వరంగల్‌కు చెందిన దోమల హేమంత్ (28), కర్నూలుకు చెందిన వాసిరెడ్డి మహేశ్వరరెడ్డి (39), వరంగల్ ఇల్లా కడిపికొండకు చెందిన బస్కే రాజేంద్రప్రసాద్ (42), కృష్ణా జిల్లా అప్పనవీడుకు చెందిన నడగుదుటి శ్రీనివాస్ (21), హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ తాసిఫ్ (25), విశాఖ జిల్లా గోపాలపురానికి చెందిన పెద్దిరెడ్డి దాలమ్మ (40)గా గుర్తించారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎంపీ మార్గాని భరత్ బుధవారం ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోస్టుమార్టం త్వరితగతిన పూర్తిచేసి బంధువులకు మృతదేహాలను అప్పగించే విధంగా చర్యలుతీసుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్య విధాన పరిషత్ ఆర్జేడీ డాక్టర్ రమేష్ కిషోర్‌తో పోస్టు మార్టంపై సమీక్షించారు.
*చిత్రాలు.. గోదావరిలో గుర్తించిన మృతదేహం * మృతుల బంధువులను ఓదారుస్తున్న మంత్రి విశ్వరూప్