ఆంధ్రప్రదేశ్‌

స్కూళ్ల అభివృద్ధిలో తల్లిదండ్రులదే ప్రధాన భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో పాఠశాల విద్యా రంగంలో ఇక నుంచి విద్యార్థుల తల్లిదండ్రులదే కీలక భూమిక కానుంది. పాఠశాలల అభివృద్ధితోపాటు బోధనాభ్యాసన కార్యక్రమాలు, ప్రమాణాల పెంపు అంశాల్లోనూ వారిని భాగస్వాములను చేస్తూ పాఠశాలల సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను పేరెంట్ మేనేజ్‌మెంట్ కమిటీలు లేదా పేరెంట్ కమిటీలుగా మార్పు చేసింది. ప్రభుత్వ స్కూళ్లలోనే కాకుండా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలోను ఈ కమిటీలను ఏర్పాటు చేయించి విద్యార్థి కేంద్రంగా విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. తద్వారా యాజమాన్య ప్రయోజనాలకు అడ్డుకట్ట వేయనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పేరెంట్ కమిటీల ప్రాధాన్యతను పలుమార్లు చెప్పారు.
పేరెంట్ కమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అన్ని వర్గాల వారికి భాగస్వామ్యం కల్పిస్తారు. మూజువాణి విధానంతో ఎన్నిక నిర్వహిస్తారు. అవసరమైతే రహస్య బ్యాలెట్ పద్ధతిని అనుసరిస్తారు. తల్లిదండ్రులు, సంరక్షకుల్లో 50 శాతానికి తగ్గకుండా ఎన్నికకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే తల్లిదండ్రుల్లో ఒక్కరికే ఓటు హక్కు ఉంటుంది. ప్రతి తరగతి నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులను సభ్యులుగా ఎన్నుకుంటారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారితోపాటు ఇద్దరు మహిళలై ఉండాలి.
ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతి నుంచి ముగ్గురు చొప్పున 15 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 24 మంది సభ్యులుంటారు. ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 9 మంది సభ్యులను ఎన్నుకుంటారు. సభ్యుల కారపరిమితి రెండేళ్లు ఉంటుంది. లేదా ఆ విద్యార్థులు పాఠశాలను వదిలి వెళ్లే వరకు ఉంటుంది. స్కూల్ హెడ్‌మాస్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఒక టీచర్, సంబంధిత వార్డు మెంబర్, కౌన్సిలర్ లేదా కార్పొరేటర్, ఏఎన్‌ఎం, వార్డు మహిళా సమాఖ్య అధ్యక్షులు, అంగన్‌వాడీ వర్కర్‌లను నియమిస్తారు. కోఆప్టెడ్ సభ్యులుగా పాఠశాల అభివృద్ధికి తోడ్పడే విద్యావేత్తలను, దాతలను, స్వచ్ఛంద సేవకులను ఎంపిక చేస్తారు.
పేరెంట్ కమిటీలకు కీలక బాధ్యతలు
ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో స్కూళ్ల సమగ్రాభివృద్ధికి పేరెంట్ కమిటీలను బలోపేతం చేయనుంది. కమిటీలకు ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. కమిటీలను ఏర్పాటు చేసి కీలక బాధ్యతలు అప్పగించనుంది.
విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు అందేలా కమిటీలు చూస్తాయి. నిధులను వినియోగించే అధికారం కమిటీలకే ఉంటుంది. పాఠశాలల పనితీరును సమీక్షించి సరైన రీతిలో కొనసాగేలా చేస్తాయి. స్కూళ్ల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడంతోపాటు పనులు అనుకున్న విధంగా జరిగేలా చూస్తాయి. ప్రభుత్వ నిధులతో కొనసాగే నిర్మాణ పనులు, ఇతర కార్యక్రమాల్లో లోపాలు లేకుండా పర్యవేక్షిస్తాయి. ఏదిఏమైనా కులమత వర్గ రాజకీయాల కతీతంగా ఈ పేరెంట్ కమిటీలు పని చేసిన్పపుడే సత్ఫలితాలు చేకూరుతాయి.