ఆంధ్రప్రదేశ్‌

సచివాలయ నియామక ఫలితాల్లో మద్దలకట్టవాసికి స్టేట్ ఫస్ట్ ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దారవీడు, సెప్టెంబర్ 19: రాష్ట్రప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న సచివాలయ వ్యవస్థలో భాగంగా ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన 2019 పరీక్ష ఫలితాల్లో ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామానికి చెందిన దొడ్డా వెంకటరామిరెడ్డి రాష్ట్రంలో కేటగిరి-3లో మొదటిర్యాంకు, కేటగిరి-1లో రాష్ట్రంలో మూడవర్యాంకు సాధించారు. వెంకటరామిరెడ్డి మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు విద్యను అభ్యశించి అనంతరం సాధన కళాశాలలో ఇంటర్ , ఎస్వీకెపి కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, ఎంఎస్‌సి, ఎంఇడి విద్యను అభ్యసించి ప్రస్తుతం కర్నూలు జిల్లా సున్నిపెంట ఐటిడిఎ గిరిజన కళాశాలలో సెంటర్ ఫర్ ఎక్సలెంటు ప్రోగ్రాం కింద గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. వెంకటరామిరెడ్డి కేటగిరి-3లో స్టేట్‌ర్యాంకు 150 మార్కులకు 105 మార్కులు సాధించారని, కేటగిరి-1లో స్టేట్ మూడవ ర్యాంకు 150 మార్కులకు గాను 111.25 మార్కులు సాధించారని తండ్రి దొడ్డా రామసుబ్బారెడ్డి తెలిపారు. మా కుమారుడు స్టేట్‌ర్యాంకు సాధించడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు.