ఆంధ్రప్రదేశ్
వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 September 2019
ఆదోని, సెప్టెంబర్ 19: కర్నూలు జిల్లా కోసిగి సమీపంలో ఉన్న చాపరేవు వాగు వరద నీటిలో బుధవారం కొట్టుకుపోయిన వీరేష్(45) మృతదేహం గురువారం లభించింది. బుధవారం సాయంత్రం పొలానికి వెళ్ళిన వీరేష్ మోటర్ సైకిల్పై వాగు దాటుతుండగా వరద నీటిలో కొట్టుకుపోయాడు. వీరేష్ కోసం గ్రామస్థులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. గురువారం ఉదయం వాగు ఒడ్డున వీరేష్ మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.