ఆంధ్రప్రదేశ్‌

సకాలంలో ‘రూర్బన్’ మిషన్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: నేషనల్ రూర్బన్ మిషన్ కింద ఎంపిక చేసిన గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కనీస సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదిత పథకాలన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో మేషనల్ రూర్బన్ మిషన్‌పై సీఎస్ అధ్యక్షతన రాష్టస్థ్రాయి సాధికార కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాలను ఆర్థికంగా, సామాజికంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన కనీస వౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ రూర్బన్ మిషన్‌ను అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రతిపాదించిన పనులన్నీ శరవేగంగా పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మైదాన ప్రాంతాల్లో 25 నుండి 50వేల జనాభా కలిగిన గ్రామాలు, కొండ గిరిజన ప్రాంతాల్లో 5 నుండి 15 వేల వరకు జనాభా కలిగిన ప్రాంతాలను క్లస్టర్లుగా గుర్తించి 60 శాతం కేంద్ర, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రానికి ఈ పథకం కింద 12 క్లస్టర్లను కేటాయించగా మూడు దశల్లో రూ.1130 కోట్లతో 10,364 పనులు చేపట్టి అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఇప్పటివరకు రూ. 865 కోట్లతో 9,194 పనులు చేపట్టగా వాటిలో రూ.498 కోట్ల విలువైన 6,360 పనులు పూర్తి చేయటం జరిగిందన్నారు. నేషనల్ రూర్బన్ మిషన్ కింద ఎంపిక చేసిన క్లస్టర్లలో ముఖ్యంగా పైపుల ద్వారా మంచినీటిని
అందించడం, పూర్తి స్థాయి పారిశుద్ధ్య నిర్వహణ, ఘన, ద్రవ్య, వ్యర్థాల నిర్వహణ, డ్రెయిన్లు, వీధి దీపాలు, అంతర్గత కనెక్టివిటీ, ప్రజా రవాణా, ప్రతి ఇంటికీ ఎల్పీజీ కనెక్షన్, నైపుణ్య శిక్షణ ద్వారా ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకోవటం ఈ పథకంలో ప్రధాన లక్ష్యాలని సీఎస్ తెలిపారు. విద్య, ఆరోగ్యం, సిటిజన్ సర్వీస్ కేంద్రాలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో సేవలు, డిజిటల్ లైబ్రరీ, పర్యావరణం, ఉపాథికల్పన, స్వయం సహాయక సంఘాల ఏర్పాటు, పర్యాటకరంగ ప్రోత్సాహం, క్రీడలు, సామాజిక వౌలిక సదుపాయాల కల్పన, గృహనిర్మాణం, సాంఘిక సంక్షేమం, తదితర అంశాల్లో ఈ క్లస్టర్లలో పూర్తిగా మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అజెండా అంశాలైన ఏలూరు క్లస్టర్ డీపీఆర్, రంపచోడవరం క్లస్టర్ రివైజ్డ్ అప్రూవల్ గురించి వివరించగా సమావేశం ఆమోదించింది. సింగరాయకొండ, కుప్పం, అరకులోయ, ఆలూరు, చందర్లపాడు, గరివిడి, నందలూర్, నూజెండ్ల, రివైజ్డ్ డీపీఆర్‌లను కూడా ఆమోదించారు. ఇంకా నేషనల్ రూర్బన్ మిషన్‌కు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్, ముఖ్య కార్యదర్శులు ఎస్‌ఎస్ రావత్, అజయ్‌జైన్, కె దమయంతి, పురపాలకశాఖ కమిషనర్ జీవీఎస్‌ఆర్‌కె విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...ఆహారశుద్ధి పరిశ్రమలపై రాష్టస్థ్రాయి ఎంపవర్ కమిటీ సమావేశంలో సమీక్షిస్తున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం