ఆంధ్రప్రదేశ్‌

ఇసుక కొరతపై ఎమ్మెల్సీ బుద్దా చురకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం ఇసుకని కూడా లేకుండా చేసి కార్మికుల్ని నడిరోడ్డు మీద పడేసిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఇసుక కొరత కారణంగా దాదాపు 70 లక్షల మంది ఉపాధి కోల్పోయేలా చేశారని మంగళవారం ట్విట్టర్‌లో బుద్దా మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని శకుని మామా అని పేర్కొంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దాదాపు 70 లక్షల మంది ఉపాధి కోల్పోయేలా చేసిన మీరు కూడా ఇసుక గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంద శకుని మామా అని వ్యాఖ్యానించారు. తెదేపా హయాంలో చంద్రబాబు ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చి కార్మికుల కడుపు నింపారని వెంకన్న పేర్కొన్నారు.