ఆంధ్రప్రదేశ్‌

కార్మిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: కార్మిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని సంఘం చైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని ఒక హోటల్‌లో మంగళవారం మీడియాతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాతీయ కార్మిక సంక్షేమ సంఘం చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌లోని కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటి వరకు కార్మిక శాఖ అధికారులతో జరిగిన రెండు సమావేశాల్లో అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించానన్నారు. దీని వల్ల మూడున్నర కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. మీడియాలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటానన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర కార్మిక సంక్షేమశాఖ పలు పథకాలు అమలు చేస్తున్నా గత ప్రభుత్వం వాటిని ఉపయోగించుకోలేదన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 58కోట్లు ఖర్చు చేసిందన్నారు.
రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా 2 బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయింపు, జర్నలిస్టుల పిల్లలకు ఏడాదికి రూ. 20వేల ఉపకార వేతనం, రూ. 15 లక్షల వరకు వైద్య చికిత్స ఖర్చులు వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 30న గుంటూరులో సభను నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ విజయవాడలో సమావేశం నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం, అధికార ప్రతినిధులు కోసూరి వెంకట్, చాగర్లమూడి గాయత్రి, మీడియా కన్వీనర్ వుల్లూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.