ఆంధ్రప్రదేశ్‌

చిల్లర కథనాలు ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 23: ముఖ్యమంత్రి జగన్ మీడియా చిల్లర కథనాలు తక్షణం ఆపకపోతే వారి దొంగ మీడియా బట్టలూడదీసి రోడ్డుపై నిలుపుతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. అక్రమాస్తుల పెట్టుబడులతో కట్టుకథలు అల్లేందుకే జగన్ తన మీడియాను విస్తరింపచేసుకున్నారని బుధవారం ట్విట్టర్ వేదికగా లోకేష్ మండిపడ్డారు. అసలు జగన్ ఢిల్లీకి ఎందుకెళ్లారో, ఏం సాధించుకువచ్చారో చెప్పుకోలేని సిగ్గుమాలిన స్థితిలో ఉన్నారన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా తాను విశాఖ ఎయిర్‌పోర్టులో కూర్చొని చిరుతిళ్ల కోసం రూ. 25లక్షలు ఖర్చు చేశానంటూ అసత్య కథనాలను అల్లారన్నారు. వీటి ఆధారాల కోసం వారు చూపించిన బిల్లుల్లోని తేదీల్లో తాను రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్నానన్నారు. ఐదేళ్ల ఏపీ సర్కార్ ప్రొటోకాల్ ఖర్చు మొత్తాన్ని తన పేరిట జమ వేయమని ఆదేశాలు జారీ చేశారా అని ప్రశ్నించారు.