ఆంధ్రప్రదేశ్
నేడు కేబినెట్ భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 November 2019
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 13న ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ఇసుక నూతన విధానానికి సంబంధించి చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదించనుంది. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. కాగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 14న గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తారు.