ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు సోమవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. తాజా రాజకీయ పరిస్థితులను గవర్నర్ బిశ్వభూషణ్‌కు వివరించిన సీఎం, త్వరలోనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరిట ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గురించి ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యమంత్రి దంపతుల గౌరవార్థం గవర్నర్ రాజ్‌భవన్లో విందు ఏర్పాట్లు చేయించారు. తొలుత రాజ్‌భవన్‌లో గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జునరావు, ఇతర అధికారులు జగన్మోహన్‌రెడ్డిని స్వాగతించారు. గవర్నర్ శాలువా, మెమెంటోలతో సీఎంను గౌరవించగా, ముఖ్యమంత్రి సైతం అదే తీరుగా గవర్నర్‌ను సత్కరించారు. సీఎం వెంట ముఖ్యమంత్రి కార్యక్రమాల కమిటీ చైర్మన్ తలశిల రఘురాం, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

*చిత్రం... సతీ సమేతంగా గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి