ఆంధ్రప్రదేశ్‌

కొడుకును చంపి.. తండ్రి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట, మార్చి 25: అప్పుల బాధ తాళలేక కన్నకొడుకుకు ఉరివేసి ఆపై తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన శుక్రవారం కడప జిల్లా ఖాజీపేట మండలం అప్పనపల్లెలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు.. అప్పనపల్లె గ్రామ పంచాయతీకి చెందిన సావిత్రమ్మతో బొబ్బిశెట్టి వీరభద్రయ్య(27)కు ఆరేళ్లక్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చేనేత మగ్గం నేసుకుంటూ జీవనం సాగించేవారు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో సావిత్రమ్మ అదే గ్రామంలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. తాగుడుకు బానిసైన వీరభద్రయ్య అప్పులు పెరిగిపోవడంతో శుక్రవారం ఉదయం తాడుతో చిన్నకొడుకు రాజేష్(3)కు ఉరి తాడు బిగించి, పెద్దకుమారుడు వీరేంద్రకు సైతం ఉరివేసే క్రమంలో ఏడుస్తూ తప్పించుకుని బయటకు పరుగెత్తాడు. దీంతో వీరభద్రయ్య కూడా ఉరివేసుకుని మృతి చెందాడు. వీరేంద్ర బయట ఏడుస్తుండటంతో గమనించిన ఇరుగుపొరుగు వారు విచారించి, తలుపులు తెరిచి చూశారు. అప్పటికే చిన్నకొడుకు, తండ్రి దూలానికి వేలాడుతూ కన్పించడంతో స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో వెంటనే ఖాజీపేట ఎస్‌ఐ రాజగోపాల్, మైదుకూరు డీఎస్పీ రామకృష్ణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలు తెలుసుకున్నారు. కాగా సావిత్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.