ఆంధ్రప్రదేశ్‌

ఏడు నెలల్లో ఏం సాధించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), డిసెంబర్ 15: వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తోందని, ఇప్పటివరకూ ఏం అభివృద్ధి చేశారు, ఏం సాధించారో చెప్పగలిగే ధైర్యం ఆ పార్టీ నాయకులకు ఉందా? అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని పదేపదే గగ్గోలు పెట్టిన మీరు ఒక్కటైనా నిరూపింగలిగారా అని ఆదివారం ట్విట్టర్‌లో నిలదీశారు. చంద్రబాబు హయాంలో అవినీతికి పాల్పడ్డారంటూ మీ ఫినాయిల్ పేపర్‌లో రాసుకుని సంబరాలు చేసుకుంటామంటే మీ ఇష్టమన్నారు. కానీ అవినీతిని తవ్వితీస్తామంటూ సీఎం జగన్ తవ్వడం ప్రారంభించి దాదాపు ఏడు నెలలు కావస్తోందన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టాడనేది వెనుకటి సామెత అని, నేడు కనీసం ఎలుక తోకను కూడా మీరు పట్టుకోలేకపోయారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబు హయాంలో 10 పైసలు అవినీతి జరిగినట్టు కూడా నిరూపించలేక పోయారన్నారు. జగన్ ఫినాయిల్ పేపర్లో మాత్రం అవినీతి అంటూ ఏడుపులు ఎందుకోనని వెంకన్న ట్వీట్ చేశారు.