ఆంధ్రప్రదేశ్‌

టీడీపీది దిక్కుమాలిన చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలన్నది ఒక చరిత్రాత్మక నిర్ణయమని, కానీ ఆ బిల్లును శాసనమండలిలో టీడీపీ అడ్డుకుందని, ఇది విపక్ష నేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల దిక్కుమాలిన వైఖరి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అందుకే అసెంబ్లీలో మంగళవారం మరోసారి ఆ బిల్లును ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి తమ ధ్యేయమని, అందుకే మంత్రి పదవుల్లో ఆరుగురిని నియమించామని, ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఇద్దరు ఆ వర్గాలకు చెంది న వారున్నారని తెలిపారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలను
విడదీసి లబ్ధిపొందాలని చూశారని సీఎం జగన్ ఆక్షేపించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూలేని విధంగా ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని సీఎం జగన్ వెల్లడించారు. మాల, మాదిగతో పాటు రెల్లి ఇతర కులాలకు వేర్వేరుగా మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఆరు మంత్రి పదవులు ఇచ్చామన్నారు. వీటన్నింటితోపాటు ఎస్సీ, ఎస్టీలకు ఇంకామేలు చేయడం కోసం వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే గతంలో ఆ బిల్లును మండలిలో టీడీపీ అడ్డుకుందని, శాసనసభలో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం కాబట్టి అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.