ఆంధ్రప్రదేశ్‌

వికేంద్రీకరణ పేరుతో జగన్నాటకం: తులసిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: రాష్ట్ర చరిత్రలో 2020, జనవరి 20 ఒక దుర్దినమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి అన్నారు. రాజధానిని మార్పు చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రక తప్పిదమవుతుందని, ఇదంతా జగన్ ఆడుతున్న నాటకమన్నారు. అలాగే ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్యగా కూడా పేర్కొన్నారు. విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో మంగళవారం మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలీతో కలిసి తులసిరెడ్డి విలేఖర్లతో మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధికి విఘాతం, వినాశనం కలుగుతుందన్నారు. జగన్, చంద్రబాబులు రాష్ట్రానికి పట్టిన రాహుకేతువులుగా పేర్కొన్నారు. చంద్రబాబు అంతర్జాతీయ రాజధాని పేరుతో మోసం చేస్తే జగన్ మూడు రాజధానులు, వికేంద్రీకరణ పేరుతో మరింత మోసం చేస్తున్నాడన్నారు.