ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారుపాళ్యం , జనవరి 21: విద్యుత్ షాక్‌కు గురై ఏనుగు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలోని టేకు మంద గ్రామంలో చోటు చేసుకొంది. గత కొంత కాలంగా బంగారుపాళ్యం మండల అటవీ సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులు సోమవారం రాత్రి టేకు మంద గ్రామం సమీపంలోని పంటపొలాలపై దాడి చేసి ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో ఏనుగుల మందలోని ఒక ఏనుగు పొలం వద్ద ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీ కొనడంతో అది విరిగి పక్కనే ఉన్న 11 కె వి విద్యుత్ లైన్ పై పడడంతో ఆ కరెంట్ వైరు తెగి ఏనుగుపై పడడంతో ఈ ఘటన చోటు చేసుకొంది. దీంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. చిత్తూరు అటవీశాఖ రేంజర్ మాధవరావు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం తిరుపతి జూ అధికారులు వచ్చి మృతి చెందిన ఏనుగుకు పోస్టు మార్టం నిర్వహించి అక్కడే పూడ్చి పెట్టారు.