ఆంధ్రప్రదేశ్‌

ఎలుకలున్నాయని ఇల్లు తగులబెట్టుకున్నటు: కన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జనవరి 21: ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగులబెట్టుకున్న చందంగా సీఎం జగన్ తీరు ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను సొంత నిర్ణయాలుగా చెప్పుకునే ధైర్యం సీఎం జగన్‌కు లేదంటూ మంగళవారం ట్విట్టర్‌లో ఆరోపించారు. గతంలో చంద్రబాబు లాగే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ రాజకీయాలు ఉన్నాయన్నారు. పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా, అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌తో పోలీసులు వ్యవహరించిన తీరును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మరో ట్వీట్‌లో కన్నా తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతునొక్కుతూ చంద్రబాబు బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నిరంకుశ, నియంతృత్వ విధానాలలో పాలించిన ఏ నాయకుడూ విజయవంతం కాలేదన్నారు.