ఆంధ్రప్రదేశ్‌

ఢిల్లీ పెద్దలు క్లాస్ తీసుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): ఏపీ రాజధానుల విషయంలో మొదట ఒకలా మాట్లాడిన పవన్‌కళ్యాణ్, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబును మించిపోయే విధంగా గంటకోకరంగా పవన్ మాట్లాడుతున్నారని గురువారం ట్విట్టర్‌లో విజయసాయి విమర్శించారు. దత్తపుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్బాలు పలికిన వెంటనే బీజీపీ పెద్దలు
పవన్‌కు పెద్ద క్లాస్ తీసుకున్నారన్నారు. తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నారన్నారు.
బయటపడుతున్న బాబు స్వభావం
బెజవాడ రౌడీలా ప్రవర్తించి పార్టీకి మంచి పేరు తెచ్చావని ఒక ఎమ్మెల్సీని మెచ్చుకుని చంద్రబాబు తన స్వభావాన్ని బయట పెట్టుకున్నారని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ట్‌లో విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు రాష్ట్రానికి ఎంత ప్రమాదకారులో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా ఆర్థమయిందన్నారు. తన మనుగడ కోసం ఎంత నీచానికైనా చంద్రబాబు దిగజారుతారని మరోసారి నిరూపితమయిందన్నారు.

'చిత్రం... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి