ఆంధ్రప్రదేశ్‌

ప్రజల పాలిట భస్మాసురుడు సీఎం జగన్: యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 25: సంక్షేమ పాలన అందిస్తారన్న ఉద్దేశంతో అధికారం అప్పగిస్తే, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి భస్మాసురుడిగా మారారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. శనివారం మంగళగిరి సమీపంలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ అశోక్‌బాబులతో కలిసి విలేఖరులతో యనమల మాట్లాడారు. మండలి రద్దు, పునరుద్ధరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండవన్న యనమల, అసెంబ్లీలో ఆర్టికల్ 169 కింద తీర్మానం చేసినంత మాత్రాన ఏమీ జరగదన్నారు. అసెంబ్లీ పంపిన తీర్మానంపై కేంద్రం బిల్లును తయారు చేసి లోక్‌సభకు పంపుతుందని, ఆ తర్వాత అది రాజ్యసభ, రాష్టప్రతి వద్దకు వెళ్తుందన్నారు. ఆర్టికల్ 174-2(బి) కింద అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉందన్నారు.